Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
చేనేతపై కేంద్రప్రభుత్వం విధించిన జీఎస్టీని రద్దు చేయాలంటూ పోస్టుకార్డు ఉద్యమానికి పిలుపునిచ్చిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కే తారకరామారావు తాజాగా ఆదివారం ఆన్లైన్ పిటీషన్ ప్రారంభించారు. చేనేత ఉత్పత్తులపై బలహీనవర్గాల ప్రజల జీవితాలు ఆధారపడి ఉన్నాయనీ, వాటిపై పన్ను విధించి, భారతీయ సంస్కృతిని కోల్పోయేలా చేయోద్దని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 5 మిలియన్ల మంది కార్మికులు ఈరంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఈరంగంలో అధికసంఖ్యలో పనిచేస్తున్నారన్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు change.org (E-link https://chng.it/sFyKKqQZmd) ద్వారా ఈ పిటీషన్కు మద్దతు తెలపాలని ట్విట్టర్ వేదికగా కోరారు.