Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు కలెక్టరేట్ల ముట్టడి :ఎస్ఎఫ్ఐ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడించనున్నట్టు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలనీ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలనీ, పెంచిన ఇంజినీరింగ్ ఫీజులను తగ్గించాలనీ, పెరిగిన ధరలకనుగుణంగా మెస్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, కళాశాలల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం తలపెట్టిన జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విద్యార్థులను కోరారు.