Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి గంగుల
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం సీఎంఆర్ గడువు పెంచడం పట్ల రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు గురువారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎంఆర్ గడుపు పెంచడం ద్వారా రాష్ట్రానికి రూ 180 కోట్ల లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. దీంతోపాటు గత యాసంగి బియ్యాన్ని బాయిల్డ్గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందనీ, దీంతో గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షల టన్నులతో కలిపి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందని తెలిపారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.