Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాహుల్గాంధీకి వెఎస్ షర్మిల బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ప్రశ్నించాలని వైఎస్సార్టీపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ని కోరారు. ఈ మేరకు ఆయనకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి రాహుల్ గాంధీ రాకను స్వాగతిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుద్వారా 18లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామంటూ నమ్మబలికిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు కేవలం 57వేల ఎకరాలకు మాత్రమే నీరందించారని పేర్కొన్నారు.