Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ను వెంటనే అరెస్టు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్లో మగ్గంపై కాళ్లు పెట్టడం ద్వారా పద్మశాలీలను ఆయన అవమానించారని తెలిపారు.గతం నుంచి టీఆర్ఎస్ నాయకులకు బీసీలను అవమానించటం పరిపాటిగా మారిందని తెలిపారు.ఈ విషయంలో ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని కోరారు. మన్నెగూడలో కురుమ,యాదవ ఆత్మీయ సమ్మేళనంలో అన్నం తినేందుకు ప్లేట్లు లేకుండా చేసి వారిని అవమానించారని తెలిపారు.