Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీం (ఎన్ఎంఎంఎస్ఎస్)కు 2022-23 విద్యాసంవత్సరంలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును వచ్చేనెల 11వ తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువు వచ్చేనెల ఏడో తేదీ వరకు ఉందని తెలిపారు. ఆ దరఖాస్తు చేసిన పత్రంపై హెడ్మాస్టర్ సంతకంతో ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసే గడువు వచ్చేనెల తొమ్మిది వరకు ఉందని పేర్కొన్నారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేయడంతోపాటు ఫీజు చెల్లింపు గడువు వచ్చేనెల 11వ తేదీ వరకు ఉందని తెలిపారు. ఇతర వివరాలకు https: //bse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
గడువు 15 వరకు పొడిగించండి : టీఎస్జీహెచ్ఎంఏ
ఎన్ఎంఎంఎస్ 2022-23 పరీక్షల నిర్వహణకు సంబంధించి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పొందడం ఆలస్యమవుతున్నదనీ, అందువల్ల ఫీజు చెల్లింపు గడువును వచ్చేనెల 15 వరకు పొడిగించాలని టీఎస ్జీహెచ్ఎంఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావును గురువారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజగంగారెడ్డి, కోశాధికారి బి తుకారాం కలిసి వినతిపత్రం సమర్పించారు. గడువును పెంచి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు అవకాశం కల్పించాలని కోరారు.