Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఫామ్ హౌజ్లో దొరికిన డబ్బు ఎంత? ఎక్కడి నుంచి ఆ డబ్బు వచ్చిందనే విషయాలను ఎందుకు బయటపెట్టడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. గురువారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి ఖాయమని గ్రహించిన టీఆర్ఎస్ డ్రామాలాడుతున్నదని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన చరిత్ర టీఆర్ఎస్దేనని అన్నారు. టీఆర్ఎస్ ఆరోపణలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీ మారాలనుకోవడం పెద్ద నేరమేమి కాదని స్పష్టం చేశారు. ఎవరైనా బీజేపీలో చేరాలనుకుంటే మధ్యవర్తుల అవసరం లేదని సూచించారు.