Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
నవతెలంగాణ- దేవరుప్పుల
రోజు మాదిరిగానే రాత్రి పూట భోజనం తయారు చేస్తున్న సమయంలో బల్లి పడిన విషయాన్ని గమనించకుండా దాన్ని తిన్న విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన జనగామ జిల్లా దేవరుప్పులలోని కస్తూరిభా పాఠశాలలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పాఠశాలలో మొత్తం 108 మంది విద్యార్థినీలు ఉండగా 25 మందిని హుటాహుటిన జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అందులో 14 మంది తీవ్ర అస్వస్థతకు గురయినట్టు విద్యార్థినులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ ఎం.రమేష్ నాయక్ సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులను జనగామ ఏరియాస్పత్రికి తరలించారు. ఈ విషయంపై వివరణ కోరడానికి హాస్టల్ వార్డెన్ ఎస్. సుకన్య గురువారం రాలేదని విద్యార్ధులు తెలిపారు. సంఘటనా స్థలానికి తహసీల్దార్ ఎం.రవీందర్ రెడ్డి చేరుకుని విద్యార్ధులకు ధైర్యం చెప్పి, రాత్రి పూట అల్పాహారం చేసి అందరూ తినే వరకు ఉండి వెళ్లారు.