Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమిళనాడు మిషన్ డైరెక్టర్ దీపక్ శ్రీవాత్సవ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని గ్రీన్ తమిళనాడు మిషన్ డైరెక్టర్, సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి దీపక్ శ్రీవాత్సవ తెలిపారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో క్షేత్ర స్థాయి అధ్యయనం నిర్వహించిన ఆయన శుక్రవారం హైదరాబాద్లోని అరణ్య భవన్లో పీసీసీఎఫ్, హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియాల్ తో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవటంలో భాగంగా గ్రీన్ తమిళనాడు పేరుతో తమ ప్రభుత్వం రానున్న పదేళ్లలో 265 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టిందని తెలిపారు. పచ్చదనం పెంపును ఒక ప్రాధాన్యతా పథకంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటం అభినందనీయమని పేర్కొన్నారు. సమావేశంలో చీఫ్ కన్జర్వేటర్లు రామలింగం, సైదులు, డిప్యూటీ కన్జర్వేటర్ శాంతారామ్, సిద్దిపేట జిల్లా అటవీ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.