Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజస్థాన్ అజ్మీర్లోని ఖ్వాజా మొహియిద్దీన్ చిస్తీ దర్గాను టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం సందర్శించారు. ఆమెకు దర్గా పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె చాదర్ను సమర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దర్గా పెద్దలు కొనియాడారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర లౌకికత్వానికి ప్రతీకంగా నిలుస్తున్నదని వివరించారు. అనంతరం పుష్కర్ దేవాలయాన్ని, శ్రీనాథ్జీ దేవాలయాన్ని కూడా ఆమె సందర్శించారు.