Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ-1) పరీక్షలు వచ్చేనెల ఒకటి నుంచి ఏడో తేదీ వరకు జరగనున్నాయి. అయితే మనుగోడు ఎన్నికల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల్లో వచ్చేనెల తొమ్మిది నుంచి 16వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. వాటితోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వచ్చేనెల తొమ్మిది నుంచి 16వ తేదీ వరకు ఎస్ఏ-1 పరీక్షలను నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన సవరణ షెడ్యూల్ను శనివారం విడుదల చేశారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు ఎస్ఏ-1 పరీక్షలను ఆరు పేపర్లు కాకుండా 11 పేపర్లతోనే నిర్వహిస్తున్నారు. ఎస్ఏ-1 పరీక్షల వరకే ఇది పరిమితం. ఆ తర్వాత ఎస్ఏ-2తోపాటు ప్రీఫైనల్, వార్షిక పరీక్షలను మాత్రం ఆరు పేపర్లతోనే నిర్వహిస్తామని విద్యాశాఖ గతంలోనే స్పష్టం చేసింది.