Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాణ్యమైన రోగ నిర్ధారణ పరీక్షలు సైతం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగస్టిక్ సేవలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. పరీక్షల నిర్వహణ, ఫలితాలలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నందుకు తెలంగాణ డయాగస్టిక్ సెంట్రల్ ల్యాబ్కు మెడికల్ టెస్టింగ్ విభాగంలో నేషనల్ అక్రిడేషన్ బోర్డు ఫర్ టెస్టింగ్ అండ్ కాల్బ్రేషన్ లాబొరేటరీస్ ( ఎన్ఎబిఎల్) సర్టిఫికేషన్ లభించింది. దీనిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.
డయాగస్టిక్ కేంద్రాలు పేదలకు వైద్య పరీక్షల భారం నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయన్నారు. అన్ని జిల్లాలో వీటిని ప్రారంభించి 57 రకాల రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. పరీక్షల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.