Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర గురుకుల విద్యాలయంలో ఈతకెళ్లి చెరువులో పడి చనిపోయిన ఘటనకు బాధ్యులెవరో తేల్చాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి విచారణకు ఆదేశించారు. విద్యాలయంలోని విద్యార్థులు అనుమతి లేకుండా బయటకు ఎలా వెళ్లారు? చెరువు దగ్గరకు పిల్లలు వెళ్తున్నా సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదు? ఎవరెవరు నిర్లక్ష్యంగా ఉన్నారు? ఈ ఘటనకు బాధ్యులెవరో తేల్చాలని కలెక్టర్ను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ డైరెక్టర్కు సూచించారు.