Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహదేవపూర్
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గోదావరి సరిహద్దయిన గడిచిరోల్ జిల్లా సిరివంచ తాలుకాలోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి 12.45 నిమిషాలకు రిక్ట్టర్ స్కేల్పై 3.8 తీవ్రతతో స్వల్పంగా భూకంపం ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, గతేడాది అక్టోబర్ 31న ఇదే జిల్లాలో స్వల్పంగా భూకంపం ఏర్పడి రిక్టర్ స్కేల్ పై 4.2 తీవ్రతతో నమోదైనట్టు చెప్పారు. భూకంపం మండలంలోని మేడిగడ్డ బ్యారేజ్కి, కాళేశ్వరం దేవాలయానికి, కన్నెపల్లి పంప్హౌస్కు సుమారు కిలోమీటర్ మేర ఉండటంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.