Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మనుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం నోటీసులు జారీ చేసింది. రాజగోపారెడ్డి దాదాపు రూ. 5.24 కోట్లను స్థానిక వ్యాపారులు, వ్యక్తులకు చెందిన 22 బ్యాంక్ ఖాతాలకు మళ్లించారని, ఆ డబ్బంతా మునుగోడు ఉపఎన్నికల్లో పంపిణీ చేయడం కోసమేనని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పలు పత్రాలను ఈసీకి సమర్పించారు. ఆ ఖాతాల నుంచి డబ్బులు తీసుకోకముందే 22 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేయాలని ఆయన కోరారు. ఎన్నికల నేపథ్యంలో ఈ తరహా భారీగా నగదు బదిలీ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. రాజగోపాల్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. సోమవారం సాయంత్రం 4 గంటల్లోగా సమాధానం చెప్పాలని, వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లను కొనుగోలు చేసేందుకు కాదని నిరూపించుకోవాలని పేర్కొంది.