Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్య, ఆరోగ్య శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి రాజేందర్ మరణించడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సౌమ్యుడు, మితభాషి, అందరితో కలుపుగోలుగా ఉండేవారని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్గా జూపల్లి రాజేందర్ పోషించిన పాత్ర మరువలేనిదని ఆయన సేవలను గుర్తు చేశారు. ఆయన నివాసానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతినికి తెలిపారు.