Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపునకు 5 వరకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వ త్రిక విశ్వ విద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు ఆ వర్సి టీ రిజిస్ట్రార్ ఎవిఎన్రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు ఈనెల ఐదో తేదీ వరకు గడువుందని తెలిపారు.ఆలస్య రుసుం రూ. వంద తో ఈనెల పదో తేదీ వరకు అవకాశ ముందని పేర్కొ న్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయో గించు కోవాలని సూచించారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలో ని అధ్యయన కేంద్రాన్ని సందర్శిం చాలనీ, లేదంటే www. braouon line.in వెబ్సైట్లో చూడాలని కోరారు.