Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయు ఉపాధ్యక్షులు ఎం హన్మేష్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని ఏ మాత్రం పట్టించుకోవటం లేదని ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం హన్మేష్ విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ ప్రథమ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి లేక పట్టణాలకు వలసొచ్చిన వారు భవన నిర్మాణ కార్మికులుగా మారారని తెలిపారు. వారిని చట్ట బద్ధంగా ఆదుకోవటంలో ప్రభత్వం విఫలమైందని పేర్కొ న్నారు. అనంతరం గ్రేటర్ హైద రాబాద్ కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నల్లన్న, ప్రధాన కార్యదర్శిగా రాందాసుతో పాటు మరో 21 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నాయకులు ఎస్ఎల్ పద్మ, ప్రవీణ్ పాల్గొన్నారు.