Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్డీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఆరోగ్యం పట్ల ఉద్యోగులకు అవగాహన కల్పించడంతో పాటు వారికి సరైన వైద్య పరీక్షలు నిర్వహిం చేందుకు నవంబరు 3వ తేదీ నుంచి 'గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్' పేరిట ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తు న్నట్టు టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. దీనికి సంబంధించిన ప్రచార పోస్టర్లను బుధవారం బస్భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంస్థలోని దాదాపు 50 వేల మంది ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ, మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక దష్టి కేంద్రీకరిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య డేటా బేస్ను తార్నాక ఆసుపత్రిలో నిక్షిప్తం చేస్తామ న్నారు. దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల్లో ఉద్యోగులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ, అవసరమైన వైద్య సలహాలు, మందులు ఇస్తామని తెలిపారు.