Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యదర్శి డాక్టర్ క్రిష్టినా.జడ్.చోంగ్తూ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి'ని గిరిజన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి డాక్టర్ క్రిష్టినా.జడ్.చోంగ్తూ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈమేరకు రాష్ట్ర స్థాయి ఎంపిక కమిటీ నిర్ణయించినట్టు తెలిపారు. 123 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 117 మంది విద్యార్థులు బుధవారం నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.