Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) ఖండన
నవతెలంగాణ -హైదరాబాద్ బ్యూరో
టీఆర్ఎస్ నాయకులు అక్రమంగా డబ్బులు పంచుతున్నారంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి బుధవారం రాత్రి మునుగోడు నియోజకవర్గంలో ధర్నాకు దిగటాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తప్పుపట్టారు. ఓడిపోతున్నామన్న భయంతోనే ఆయన ఈ చర్యకు పాల్పడ్డారని విమర్శించారు. ఇప్పటివరకూ చేసిన అవినీతి అక్రమాలు బయటపడతాయనే ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరికీ రాజగోపాల్రెడ్డి బాగోతం అర్థమైందని అన్నారు. రూ. 18 వేల కోట్లకు అమ్ముడుపోయి స్వార్థం కోసం రాజీనామా చేశారతప్ప... ఆయనలో ఎలాంటి నిజాయితీ లేదనే విషయం ఓటర్లకు తెలిసిపోయిందని పేర్కొన్నారు. గురువారం ఎన్నిక ఉండటంతో రాజగోపాల్రెడ్డి ఇలాంటి డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. దీన్ని సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు.