Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశాంత వాతావరణంలో పోలింగ్
నవతెలంగాణ - సంస్థాన్ నారాయణపురం
యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో గురువారం పోలింగ్ కేంద్రాల్లో రాచకొండ సీపీ మహేష్ భగవత్ పరిశీలిం చారు. ప్రతి ఒక్క ఓటరూ ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలని సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం 7 గంటలకే మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైందన్నారు. పుట్టపాక గ్రామంలో ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ నాయకుల వద్ద రూ.లక్షా 96 వేలు, పది వేలకుపైగా విలువైన మద్యం, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పది మందిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారని తెలిపారు.