Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక కోసం పని చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మంత్రి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నిక కోసం గత నెల రోజులుగా పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందిస్తున్నట్టు చెప్పారు. పార్టీ ఆదేశాలమేరకు తమ తమ ప్రాంతాల నుంచి వచ్చి మునుగోడులో ఉంటూ టీఆర్ఎస్ సుపరిపాలనను అక్కడి ప్రజలకు వివరించి పార్టీ గెలుపు కోసం పని చేసిన ఇంచార్జిలకు, నాయకులకు, వారితో వచ్చిన కార్యకర్తలకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకారం అందించిన సోషల్మీడియా వారియర్లను సైతం ఆయన అభినందించారు.