Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - స్టేషన్ఘన్పూర్
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం సముద్రాల గ్రామంలో శుక్రవారం జరిగింది. సీఐ ఆలే రాఘవేందర్ తెలిపిన వివరాల ప్రకారం... సముద్రాల గ్రామానికి చెందిన రైతు చిలువేరు బాపురాజు (35) ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది అధిక వర్షాలు పడటంతో పంట దిగుబడి సరిగా రాలేదు. గతేడాది అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెట్టాడు. సుమారు రూ.6లక్షల వరకు అప్పులయ్యాయి. ఈసారి పంట తక్కువ దిగుబడి రాగా మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన భార్య చుట్టూ పక్కల వారి సాయంతో చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందాడు. మృతునికి ఇద్దరు పిల్లలున్నారు. మృతుని భార్య కోమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.