Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికల వ్యవస్థను దిగజార్చరనీ, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని బీ సీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సామాన్య వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయా లంటే భయపడే పరిస్థితులను తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. బహిరంగంగా డబ్బు పంపిణీ చేస్తున్నా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించారని తెలిపారు.