Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానే శ్వర్ను తెలంగాణ తెలుగుదేశం పార్టీ (టీటీడీపీ) రాష్ట్ర అధ్యక్షులుగా నియ మితుల య్యారు. ఈమేరకు ఆపార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. మూడు వారాల క్రితం ఆయన పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి టీడీపీలో పార్టీలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా పని చేస్తున్న బక్కని నర్సింహులుకు పార్టీ పొలిట్బ్యూరో సభ్యునిగా నియమించారు. జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించారు. ఈనెల 10న రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నది.