Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శంకరపట్నం
అప్పులు బాధ తాళలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఆదివారం జరిగింది. కాచాపూర్ గ్రామానికి చెందిన కొమ్మురాజుల ఎల్లయ్య(50) ఇదే గ్రామంలో 5ఎకరాల భూమి కౌలు తీసుకుని పత్తి, వరి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం రూ.5లక్షల అప్పు చేశాడు. వర్షాల కారణంగా పంట దిగుబడి రాలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురైన ఎల్లయ్య పొలం వద్దకు వెళ్లి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య కొమ్ము రాజుల రజిత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు కేశవపట్నం ఎస్ఐ దేశ్ చంద్రశేఖర్ తెలిపారు.