Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఫలితాలపై రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై ఆయన ఆదివారం ట్వీట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నదే ముఖ్యమని తెలిపారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నిఖార్సుగా, నిబద్ధతగా పని చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.