Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు అవకాశమిచ్చి, విజయానికి కారణమైనందుకు ఆయన సీఎంకు కతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కూసుకుంట్ల విజయం కోసం కషి చేసిన పార్టీ నేతలను అభినందించారు. పార్టీ మీద, నాయకత్వం మీద విశ్వాసంతో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యాచరణలో పెట్టేందుకు పూనుకోవాలని ఆదేశించారు. దానికోసం సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలంటూ మంత్రి జగదీశ్ రెడ్డిని ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రిని కలిశారు.