Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ స్టేట్ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (టీఎస్డీడీసీఓఎఫ్ఎల్) చైర్మెన్గా సోమా భరత్కుమార్ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఈ పదవిలో రెండేండ్ల పాటు కొనసాగుతారు. ఈ సందర్భంగా భరత్కుమార్ తన నియామక ఉత్తర్వును సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రగతి భవన్లో అందుకుని, కృతజ్ఞతలు తెలిపారు. భరత్కుమార్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సూర్యాపేట జిల్లా, తుంగతూర్తి నియోజకవర్గం, వర్థమానుకోట గ్రామం, వైశ్య సామాజిక వర్గానికి చెందిన వత్తి రీత్యా న్యాయవాది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావం నుంచి ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్నారు.