Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచిన సందర్భంగా మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి, టీఎమ్యూ ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, హరీశ్రావులను కలిసారు. వారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
మగ్దూంభవన్లో...
సమాఖ్య చైర్మెన్ రాజిరెడ్డితో పాటు నాయకులు బీజేఎమ్ రెడ్డి, ఎమ్వీ చారి, ఈద శంకరయ్య, కత్తులత యాదయ్య తదితరులు మగ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, అజీజ్పాషాని కలిశారు. మునుగోడు విజయంపై శుభాకాంక్షలు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరింపచేయాలని విజ్ఞప్తి చేశారు.