Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎమ్)గా అరుణ్ కుమార్ జైన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆయన ఇక్కడే ఇంచార్జి జీఎమ్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన్ని పూర్తికాల జీఎమ్గా నియమిస్తూ కేంద్రంప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ సిగల్ ఇంజనీర్స్ (ఐఆర్ఎస్ఎస్ఏఈ) 1986 బ్యాచ్కి చెందినవారు. ఆయనకు పలువురు రైల్వే ఉన్నతాధికారులు అభినందనలు తెలిపారు.