Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ వెల్లడి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీ కార్మికులకు త్వరలో వేతన సవరణ చేపడతామని ఆ సంస్థ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దీనికి పూర్తి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. దానిలో భాగంగానే ఆర్టీసీ కార్మికులకు ఇటీవల మూడు డిఏలు, పండుగ అడ్వాన్సులు, ఇతర బకాయిల చెల్లించారనీ, దానికోసం రూ.100 కోట్లు కేటాయించారనీ వివరించారు. మంగళవారంనాడాయన మంత్రి కే తారకరామారావును ప్రగతిభవన్లో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందించారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించడం పట్ల ఆయనకు అభినందనలు తెలిపారు. మునుగోడులో ఆర్టీసీ కార్మికులు టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచారని చెప్పారు. ఆర్టీసీకి ప్రభుత్వం సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తున్నదంటూ కృతజ్ఞతలు తెలిపారు.