Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తమ్మినేని వీరభద్రంను కలిసిన నిమ్స్ సీఐటీయూ నాయకులు
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిమ్స్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంను నిమ్స్ సీఐటీయూ నాయకులు కలిసి కోరారు. ఈ మేరకు మంగళవారం తమ్మినేని వీరభద్రంను కలిసి వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో లేబర్ కమిషనర్తో చర్చలు జరిగిన సమయంలో నిమ్స్ మేనేజ్మెంట్ కాంట్రాక్టు ఉద్యోగులతో వేతనాలు పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపారు. కానీ అది అర్ధాంతరంగా ఆగిపోయిందని ఇప్పుడు యజమాన్యం చెబుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అయితే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ తమకు హామీ ఇచ్చి అమలుచేయలేదన్నారు. తమ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని తమ్మినేని కోరారు. దీనిపై తమ్మినేని వీరభద్రం స్పందిస్తూ.. త్వరలో సీఎంను కలిసి సమస్యలపైన మాట్లాడుతానని వారికి హామీ ఇచ్చారు. కలిసిన వారిలో నిమ్స్ సీఐటీయూ అధ్యక్షులు ఈశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి బాలయ్య, శ్రీనివాస్, డేవిడ్, ప్రవీణ్, రాజేష్, డప్పు నరసింహ, రాధిక, లక్ష్మి,రాణి తదితరులు ఉన్నారు.