Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అటవీ క్షేత్రాధికారులు శిక్షణా కాలంలో సవాళ్లను తట్టుకుని ఉన్నత ప్రమాణాలను సాధించాలని పీసీసీఎఫ్ డోబ్రియల్ సూచించారు. బుధవారం హైదరాబాద్(దూలపల్లి)లోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో అటవీ క్షేత్రాధికారుల తొమ్మిదో బ్యాచ్ ప్రవేశ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీ అటవీ విద్య, శిక్షణలను అందించడంలో ప్రసిద్ధిగాంచిందన్నారు. శిక్షణార్థులు అకాడమీ వనరులను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలనీ, శీతోష్ణస్థితి మార్పు, భూతాపం, మానవ-వన్యప్రాణి ఘర్షణ, మొదలగు సవాళ్ళ నేపథ్యంలో తాము ఎంచుకున్న ఏదైనా అటవీ విభాగంలో నైపుణ్యాలను పొంది, తద్వారా ఆయా రంగాలలో ఉన్నత ప్రమాణాలు సాధించడానికి కషి చేయాలని కోరారు. అకాడమీ సంచాలకులు పీవీ రాజారావు అధ్యక్షత వహించారు. ఉప సంచాలకులు శిక్షణా కార్యక్రమ వివరాలను తెలిపారు.