Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఉన్నది రాజ్ భవన్ కాదనీ, బీజేపీ భవన్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు ఆమోదించడానికి కాలపరిమితి లేదనీ, ఎంత కాలమైన ఆపుతామనీ, తామే సుప్రీం అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైగా కాకుండా బీజేపీ నాయకురాలి మాదిరిగా వ్యవహరిస్తున్నారని ఒక ప్రకటనలో తెలిపారు