Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థాపనకు దరఖాస్తులకు ఆహ్వానం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ట్రాన్స్ జెండర్ పర్సన్స్ స్టేట్ హౌం యూనిట్ స్థాపన కోసం వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ధరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు గురువారం ఆ శాఖ సంచాలకులు బి.శైలజ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్జీవోలు, సీబీఓలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. పది రోజుల్లోగా శాఖ వెబ్సైట్ www.wdsc.Telangana.gov.inకు ధరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 96523 94751లో సంప్రదించాలని సూచించారు.
అవార్డులకు ఆహ్వానం
డిసెంబర్ మూడున అంతర్జాతీయ వికాలంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వికలాంగుల సాధికారత అవార్డు-2022ను ప్రదానం చేయనున్నట్టు వికలాంగుల, వయోవృద్ధుల శాఖ తెలిపింది. అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి ధరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెల 23 వరకు ధరఖాస్తులు సమర్పించవచ్చు.
అపరాథ రుసుం లేదు
ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహించనున్నట్టు రాష్ట్ర కేంద్ర గ్రంధాలయ ముఖ్య గ్రంథపాలకులు పి.జి.వి.రాణి తెలిపారు. ఇది వరకే పుస్తకాలను అరువు తీసుకుని గడువు ముగిసినప్పటికీ తిరిగిచ్చే వారికి ఎలాంటి అపరాథ రుసుం లేకుండా చూస్తామని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ఆమె తెలిపారు.