Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గేకు బక్క జడ్సన్ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ కమాండర్ రేవంత్రెడ్డి బీజేపీతో కుమ్మక్కై కాంగ్రెస్కు కుట్రదారుడిగా మారాడని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ ఆరోపిం చారు. పీసీసీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రేవంత్తో రాజీనామా చేయించాలని కోరారు. ఈమేరకు గురువారం ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు ఆయన లేఖ రాశారు. పార్టీ ఆశించిన విధంగా రేవంత్ పనితీరు లేదని పేర్కొన్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు 3000 ఓట్లు వచ్చాయని తెలిపారు. మునుగోడులోనూ ఆయన బీజేపీ ములాఖత్ అయి కృష్ణారెడ్డికి టికెట్ ఇప్పించాలని ప్రయత్నించారని పేర్కొన్నారు.