Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీకి దళిత క్రైస్తవుల బహిరంగ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ పాలనలో తాము తీవ్రమైన అణచివేతకు గురవుతున్నామని రాష్ట్రంలోని దళిత క్రైస్తవులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారి తరపున తెలంగాణ ఫుడ్స్ చైర్మెన్ మేడే రాజీవ్సాగర్ ప్రధాని మోడీకి శుక్రవారం లేఖ రాశారు. చాతుర్వర్ణ వ్యవస్థ ఉండాలని కోరుకునే బీజేపీ, ఆరెస్సెస్... దళితులకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు వారికి దక్కకుండా చేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా దళితులను సమాజానికి దూరం చేసేందుకు, వారి అవకాశాలను దెబ్బ తీసేందుకు ఆయా శక్తులు కుట్రలు పన్నుతున్నాయని తెలిపారు.