Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల చదువు బాధ్యత, ఆ మహిళకు ఉద్యోగం ఇచ్చేందుకు హామీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సిద్దిపేట జిల్లా చీరియాల్కు చెందిన సంధ్య కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన ట్వీట్కు భారత్ బయోటెక్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా స్పందించారు. సంధ్య ముగ్గురు పిల్లల చదువు బాధ్యతను స్వీకరిస్తున్నట్టు, ఆమెకు జీనోమ్ వ్యాలీ క్యాంపస్లో ఉద్యోగం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. గవర్నర్ బైరాన్పల్లికి వెళ్లి తిరిగి హైదరాబాద్కు వచ్చే క్రమంలో ఆమె కాన్వారును సంధ్య ఆపింది. దీంతో గవర్నర్ వెహికిల్ దిగి ఆమె ఇంటికి వెళ్లారు. తన ముగ్గురు కూతుర్లతో కలిసి శిథిలమైన ఇంట్లో ఉండటాన్ని చూసి తమిళసై సౌందరరాజన్ చలించిపోయారు. రాజ్భవన్ నుంచి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత ఆ మహిళా కుటుంబం పరిస్థితి గురించి వివరిస్తూ గవర్నర్ ట్వీట్ చేశారు.