Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నేతలు తప్పుడు విమర్శలు మానుకోవాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. సింగరేణి ప్ర్రయివేటీకరణ పై తప్పుడు ప్రకటన చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను శనివారం ఆయన ఒక ప్రకటనలో ఖండించారు. తెలంగాణకు న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు, ప్రాజెక్టులకు సంబంధించి ప్రధానితో ఎందుకు ప్రకటన చేయించ లేక పోతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. వడ్లు కొనడం చేతకాని కేంద్ర ప్రభుత్వం అడ్డగోలు రాజకీయం చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఓసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.