Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రజక, నాయీబ్రాహ్మణుల లాండ్రీ, సెలూన్ షాపులకు సంబంధించిన ఉచిత విద్యుత్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుమ్మడిరాజు నాగరాజు, పైళ్ల ఆశయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయమై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుని కలిసి విన్నవించామనీ, తాను స్పందించి వెంటనే విడుదల చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రూ.12.88 కోట్ల నిధులను విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.బకాయిలు విడుదలపై వారు హర్షం వ్యక్తం చేస్తూ..ప్రభుత్వానికి దన్యవాదాలు తెలిపారు.