Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాపన్నగారి మాణిక్రెడ్డిని గెలిపించుకుందామని టీఎస్ ఎంఎస్టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రంజిత్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యారంగం, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు. సమస్యలను సత్వరమే పరిష్కరించగల, ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నించగలిగే సమర్థవంతమైన అవినీతిరహిత నాయకుడైన మాణిక్రెడ్డిని గెలిపించాలని కోరారు.