Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంటర్ విద్యలో సంస్కరణలను స్వాగతిస్తున్నామని తెలంగాణ ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి (టిప్స్) కన్వీనర్లు మాచర్ల రామకృష్ణగౌడ్, కొప్పిశెట్టి సురేష్, సమన్వయకర్త ఎం జంగయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నవీన్మిట్టల్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే విద్యాశాఖ మంత్రి, కార్యదర్శి, ఉన్నతాధికారుల సహకారంతో ఇంటర్ బోర్డు పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు సంస్కరణలకు నాంది పలికి ''ఈ-ఆఫీస్'' ద్వారా పరిపాలనను కొనసాగిస్తూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ దృష్ట్యా ప్రభుత్వ, ప్రయివేటు జూనియర్ కాలేజీల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందిస్తున్నారని తెలిపారు.