Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుంతో డిసెంబర్ 22 వరకు అవకాశం : ఇంటర్ బోర్డు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2023, మార్చిలో జరిగే వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్నది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఫీజు చెల్లింపు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ (జనరల్, ఒకేషనల్) రెగ్యులర్, ఫెయిలైన విద్యార్థులతోపాటు హాజరు మినహాయింపు ఉన్న ప్రయి వేటు విద్యార్థులు సైతం ఫీజు చెల్లించాలని కోరారు. ఆలస్య రుసుం రూ.100తో డిసెంబర్ రెండు నుంచి ఆరు వరకు, రూ.500తో ఎనిమిది నుంచి 12 వరకు, రూ. వెయ్యి తో వచ్చేనెల 14 నుంచి 17 వరకు, రూ.రెండు వేలతో అదేనెల 19 నుంచి 22వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశముందని పేర్కొన్నారు. ఇంటర్ ఫస్టియర్ థియరీ సబ్జెక్టులకు జనరల్ విద్యార్థులకు రూ.500, ఒకేషనల్ విద్యార్థులకు రూ.710 (థియరీకి రూ.500, ప్రాక్టికల్స్కు రూ.210) చెల్లించాలని వివరించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు థియరీ సబ్జెక్టులకు రూ.500, సైన్స్ విద్యార్థులు రూ.710 (థియరీకి రూ.500, ప్రాక్టికల్స్కు రూ.210) ఫీజు చెల్లించాలని తెలిపారు. ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విద్యార్థులు రూ.710 (థియరీకి రూ.500, ప్రాక్టికల్స్కు రూ.210) చెల్లించాలని పేర్కొన్నారు. హాజరు మిన హాయింపుతో ప్రయివేటుగా రాసే ఆర్ట్స్, హ్యుమానిటీస్ విద్యార్థులు ఈనెల 30 వరకు రూ.500 చెల్లించాలని కోరారు. ఆలస్య రుసుం రూ.200తో డిసెంబర్ 12 వరకు గడువుందని తెలిపారు. ఇతర వివరాలకు tsbie.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.