Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రానికి చెందిన ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డిఎస్ఎన్ ఫిల్మ్స్(డీఎస్ఎన్ ఫిలిమ్స్) ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ) ఆన్యూవల్ ఎక్స్లెన్స్ అవార్డ్స్ 2022లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పీఆర్ఎస్ఐ కోల్కతాలో నవంబర్ 12న నిర్వహించిన గ్లోబల్ కమ్యూనికేషన్ కాంక్లేవ్లో డీఎస్ఎన్ ఫిల్మ్స్ ప్రయివేట్ లిమిటెడ్ సీఈఓ, ఎండీ, అంతర్జాతీయ డాక్యుమెంటరీ ఫిల్మ్ అవార్డ్ గ్రహీత దూలం సత్యనారాయణ ఈ అవార్డులను అందు కున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోసం తాము రూపొందించిన ఫిల్మ్క్కు అవార్డులు ప్రకటించిన జ్యూరీ, పీఆర్సీఐకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. డిఎస్ఎన్ ఫిల్మ్స్ సాధిస్తున్న విజయాలకు సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిరంతర మద్దతు, ప్రోత్సాహమే కారణమని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేసే పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థ రూపొందించిన వీడియోలతో తెలంగాణలో ఉన్న టూరిజం , ఇతర అంశాలు దేశం దృష్టిని ఆకర్షించినందుకు గర్వంగా ఉందన్నారు.
గెలుచుకున్న అవార్డులివే...
1.క్రిస్టల్ అవార్డు - కళలు, సంస్కృతి, క్రీడల ప్రచారం: బుద్ధవనం (ఆధ్యాత్మిక పర్యాటక చిత్రం)
2. గోల్డ్ అవార్డు - విజనరీ లీడర్షిప్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్: సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతిశీల తెలంగాణ
3. గోల్డ్ అవార్డ్ - ట్రావెల్, లీజర్ ,హాస్పిటాలిటీ క్యాంపెయిన్: తెలంగాణ టూరిజం సోమశిల టూరిజం సర్క్యూట్
4. గోల్డ్ అవార్డు - హెల్త్ కేర్ కమ్యూనికేషన్ ఫిల్మ్స్ : తెలంగాణలో కోవిడ్-19 అవగాహన ప్రచారం
5. కాంస్య అవార్డు - ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్స్: రైతు బంధు, రైతు బీమా