Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రానికి మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖల మంత్రి కే.తారకరామారావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధి, హౌజింగ్ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని స్వయంగా కలిసి వివరించేందు కు సమయం కోరుతూ సోమవారం నాడాయన లేఖ రాసారు. ఈ విషయం లో మరింత ఆలస్యం కాకుండా తెలంగాణ ప్రభుత్వం తరుపున మెట్రో విస్తరణకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ సారథ్యంలో రూపొం దించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా కేంద్రానికి పంపినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. హైదరాబాద్ ఫేజ్ టూ, ఫేజ్ వన్ కారిడార్ నెంబర్ 3 (నాగోల్ -ఎల్బీనగర్) విస్తరణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఇప్పటికే బీహెచ్ఈఎల్, లక్డీకాపూల్ మధ్య 26 కిలోమీటర్ల ( 23 స్టేషన్లతో ) ఎల్బీనగర్-నాగోల్ మధ్య (4 స్టేషన్లతో 5 కిలోమీటర్ల వరకు) మెట్రోను మరింత విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రయ త్నాలు ప్రారంభించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కోవిడ్ తరువాత హైదరాబాద్ లో ఊహించిన దానికంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరగడం, పూర్తి స్థాయిలో కార్యాలయాలు పనిచేస్తుండడంతో మెట్రోను మరింత విస్తరించాల నుకుంటున్నామని వివరించారు. ఫేజ్-1లో 69 కిలోమీటర్ల మేర నడుస్తున్న మెట్రోకు అదనంగా మరో 31 కి.మీ., విస్తరించాలనుకుంటున్నామనీ, దీనికి కేంద్రం ఆర్థికంగా చేయూత ఇవ్వాలని కోరారు. బీహెచ్ఈఎల్-లక్డీకాపుల్, నాగోల్-ఎల్బీనగర్ కారిడార్ నిర్మాణానికి రూ.8,453 కోట్లు వ్యయమవు తుందనీ, దీన్ని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి భాగస్వామ్యంలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలకు సూత్రప్రాయ అంగీకారం ఇచ్చి, వచ్చే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని కోరారు.