Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆమె మాటల్ని ప్రజలు పట్టించుకోవట్లేదు : రాష్ట్ర మంత్రి జీ జగదీశ్రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ ముమ్మాటికీ బీజేపీ కార్యకర్తే అనీ, ప్రజలకు ఈ విషయం సంపూర్ణంగా అర్థమైందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి విమర్శించారు. రాజ్భవన్ను బీజేపీ రెండో కార్యాలయంగా మార్చారనీ, అందుకే ఆమె మాటల్ని ప్రజలెవరూ పట్టించుకోవట్లేదని అన్నారు. సోమవారం హైదరాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ విధి విధానాలు స్పష్టంగా రాజ్యాంగంలో పొందుపర్చారనీ, దాన్ని ధిక్కరించి ఆమె వ్యవహరిస్తున్నారని అన్నారు. ఆమెను తాము బీజేపీ కార్యకర్తగానే చూస్తామన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నదనీ, ముఖ్యంగా గుజరాత్ ప్రజలు అక్కడి బీజేపీ ప్రభుత్వాన్ని ఈ పథకాలను చూపించి, ప్రశ్నిస్తున్నారని చెప్పారు. అందుకే తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చి, ఇక్కడి ప్రజలకు సంక్షేమాన్ని దూరం చేస్తే, ఇక ప్రశ్నించేవారు ఎవరూ ఉండరనే దురాలోచనతో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్నదంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ మాటల్ని నమ్మే స్థితిలో లేరన్నారు.