Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ట్రాన్స్ జెండర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి. శైలజ కోరారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, లింగమార్పిడి వ్యక్తుల ట్రాన్స్ జెండర్ (హక్కుల రక్షణ) చట్టం, 2019ని అమలులోకి తెచ్చిందని పేర్కొన్నారు.
చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం 'ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) నియమాలు, 2020'ని కూడా సిద్ధం చేసిందని పేర్కొన్నారు.ఈమేరకు మంగళవారం డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. లింగమార్పిడి వ్యక్తులు స్కాలర్షిప్లు, స్కిల్డెవలప్మెంట్, ఎంప్లారుమెంట్, కాంపోజిట్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, టీజీ సర్టిఫికేట్ మరియు ఐడెంటిటీ కార్డు వంటి సంక్షేమ పథకాలను పొందేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ వన్-స్టాప్ పోర్టల్ను ప్రారంభించిందని పేర్కొన్నారు. ఆ పోర్టల్లో నమోదు చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడు పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ (యూనిక్రిజిస్ట్రేషన్ నెంబర్)ను అందజేయడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ (లింగమార్పిడి) వ్యక్తుల నమోదు కోసం https://transgender.dosje.gov.in నేషనల్ పోర్టల్ను సంప్రదించాలని కోరారు.