Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ధర్తీ అభా భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని పురస్కరించుకొని 'జన్ జాతీయ గౌరవ్ దివస్' జయంతిని ఘనంగా నిర్వహించినట్టు మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు.జోన్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, గుంటూరు,గుంతకల్,నాందేడ్లోని రైల్వే ప్రధాన కార్యాలయాల్లో అధికా రులు, సిబ్బంది ఈ కార్యక్రమాల్లో పాల్గొని నివాళులర్పించారు. గిరిజ న స్వాతంత్య్ర సమరయోధుల జ్ఞాపకార్థం నవంబర్ 15 నవంబర్ తేదీని 'జన్ జాతీయ గౌరవ్ దివస్'గా జరుపుకోవాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అమల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు.